Wednesday, January 21, 2026 | Sandesh TV Daily News
Logo

భద్రాద్రిలో సీతారాముల వారి ఆశీర్వాదం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

news.title

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి సోమవారం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలను తీసుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.