Wednesday, January 21, 2026 | Sandesh TV Daily News
Logo

మున్సిపల్ ఎన్నికల నగారా: ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల

news.title

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియడంతో, ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలపై పడింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 117 మున్సిపాలిటీలు మరియు 6 ప్రధాన నగరపాలక సంస్థల్లో (కార్పొరేషన్లలో) ఓటర్ల జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కీలక ప్రాంతాల్లో కసరత్తు:రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మహబూబ్ నగర్, కొత్తగూడెం మరియు మంచిర్యాల కార్పొరేషన్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాల్లో ఓటర్ల వివరాల సేకరణ, మార్పులు మరియు చేర్పుల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇదీ: ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి ఈసీ స్పష్టమైన గడువును విధించింది: డిసెంబర్ 30: ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం. జనవరి 1: ముసాయిదా (Draft) జాబితా ప్రకటన. జనవరి 10: అభ్యంతరాల పరిశీలన అనంతరం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల.ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.